ముచ్చటగా మూడోసారి.. ఇంద్రగంటి ఈ సారి హిట్ కొడతాడా?

-

వి సినిమాతో ప్రేక్షకుల నుండి నెగెటివ్ రివ్యూస్ అందుకున్న ఇంద్రగంటి మోహనక్రిష్ణ, తన తర్వాతి చిత్రాని ప్రకటించబోతున్నాడు. ఎన్నో అంచనాల మధ్య ఓటీటీలో విడుదలైన వి సినిమాకి ప్రేక్షకాదరణ దక్కకపోవడంతో ఇంద్రగంటికి ఆఫర్లు తగ్గాయని అన్నారు. తాజా సమాచారం ప్రకారం సుధీర్ బాబు హీరోగా, సినిమా తెరకెక్కిస్తున్నాడట. సోమవారం రోజు ఈ సినిమా లాంచింగ్ ఉండనుందని తెలుస్తుంది. సుధీర్ బాబు, ఇంద్రగంటి కాంబినేషన్లో ఇప్పటి వరకు రెండు సినిమాలు తెరకెక్కాయి.

ప్రస్తుతం మూడవ చిత్రంగా వస్తున్న ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా కనిపిస్తుందట. మహేంద్ర బాబు, కిరణ్ బొల్లపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మరికొద్ది రోజుల్లో మొదలవనుందట. సమ్మోహనం సినిమాతో సుధీర్ బాబుకి మంచి హిట్ అందించిన ఇంద్రగంటి మోహనక్రిష్ణ, వి సినిమాతో డిజాస్టర్ ఇచ్చాడు. మరి ముచ్చటగా మూడోసారి కలిసి సినిమా చేస్తున్నందున, ఈ సారి గట్టి హిట్ కొడతాడేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news