మేడి గడ్డ రికార్డ్..

-

తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన మేడిగడ్డ బ్యారేజీ పనుల్లో అధికారులు రికార్డు సృష్టించారు. శనివారం ఉదయం 8గంటల నుంచి ఆదివారం ఉదయం 8గంటల వరకూ ఒకే రోజులో రికార్డు స్థాయిలో 16,722 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు ఒకే సారి పూర్తి చేశారు. గతంలో ఒకే రోజు 7,212 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు పూర్తి చేసి రికార్డు సాధించగా ఆ రికార్డును ప్రస్తుత కాంక్రీట్ పనులతో అధికారులు తిరగరాశారు. తెలంగాణ ప్రభుత్వంలో నీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో మేడిగడ్డ పనులు త్వరితగతిన పూర్తి కానున్నడంతో నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్, హరీశ్ రావులు, ఇతర నేతలు అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news