గరుడ పక్షి పేరు విన్నారా ఎప్పుడైనా? అది ఇప్పుడు నిజంగానే ప్రత్యక్షమైంది. ఎక్కడో తెలుసా? జగిత్యాల జిల్లాలోని కోరుట్లలో ఉన్న శ్రీవేంకటేశ్వర స్వామి టెంపుల్లో. అవును.. గరుడ పక్షి సడెన్గా గుడిలో ప్రత్యక్షమవడంతో దాన్ని తీసుకెళ్లి స్వామి వారి చెంతన ఉంచారు అర్చకులు. ఆలయ గోపురం నుంచి అది గుడిలో పడినట్లు భక్తులు చెబుతున్నారు. గరుడ పక్షి గుడిలోకి వచ్చిందని తెలుసుకున్న కోరుట్ల వాసులు దాన్ని చూడటానికి తండోపతండాలుగా గుడికి తరలివస్తున్నారు.
వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యక్షమైన గరుడ పక్షి
By Anil Kumar
-
Previous article
Next article