పాక్ ప్రధానికి మోదీ లేఖ

-

భారత్ – పాక్ ల మధ్య శాంతి స్థాపనే లక్ష్యం..

ఇటీవల పాకిస్థాన్ ప్రధానిగా ఎన్నికైన ఇమ్రాన్ ఖాన్ కి శుభాకాంక్షలు తెలుపుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ లేఖ రాశారు. భారత్ – పాక్ ల మధ్య శాంతి స్థాపనే లక్ష్యంగా  ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు నెలకొనాలని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ అభివృద్ధికి పరస్పరం సహకరించుకోవాలని, ఇందులో భాగంగానే పొరుగు దేశాలతో స్నేహపూర్వక సంబంధాలు కోరుకుంటామని లేఖలో పేర్కొన్నట్లు  అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇమ్రాన్ ఖాన్ ఎన్నికల్లో విజయం సాధించిన సమయంలోనూ మోదీ ఆయనకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news