భర్తకు రెండు పెళ్ళిళ్ళు : కరీంనగర్ పోలీస్ స్టేషన్ ఎదుట మహిళ దారుణం

-

కరీంనగర్ జిల్లా టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట సానిటీజర్ తాగి దివ్య అనే వివాహిత ఆత్మహత్య యత్నం చేసింది. అయితే,, ఈ ఘటనను అడ్డుకున్న కుటుంబ సభ్యులు… వెంటనే పోలీస్ వాహనం లో హాస్పిటల్ కు తరలించారు. భర్త పై ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడం లేదనే నేపథ్యంలోనే బాధితురాలి ఈ ఆత్మహత్య యత్నం చేసిందని సమాచారం అందుతోంది. బాధితురాలికి తెలియకుండా అక్రమ సంబంధం పెట్టుకొని మరో వివాహం చేసుకున్నాడు భర్త మురళీ కృష్ణ.

2017 లో దివ్యకు తెలియకుండా సుజాత అనే మహిళను వివాహం చేసుకున్న మురళి కృష్ణ…దివ్యను వేధింపులకు గురి చేశాడు. పలు మార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ జరిగినప్పటికే మురళి కృష్ణలో మార్పు రాలేదు. దీంతో నాలుగు రోజుల క్రితం మురళి కృష్ణ ఇంటికి వెళ్లి గొడవ చేసిన భార్య దివ్య బంధువులు. అయితే తనను దివ్య బంధువులు రేప్ చేసారంటూ పోలీసులకు పిర్యాదు చేసింది మురళి కృష్ణ మరో భార్య సుజాత. అయితే ఈ నేపథ్యంలోనే దివ్య పోలీస్ స్టేషన్ ఎదుట సానిటీజర్ తాగి ఆత్మహత్య యత్నం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news