“సలార్” నుంచి క్రేజీ అప్డేట్ : “రాజమన్నార్” రాబోతున్నాడు!

-

కేజీఎఫ్ సినిమాతో విపరీతమైన పాపులారిటీని సంపాదించుకున్న ప్రశాంత్ నీల్, తన తర్వాతి చిత్రాన్ని పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సలార్ పేరుతో ఈ సినిమా షూటింగ్‌ కూడా జరుపు కుంటోంది. ఇక ఇందులో హీరోయిన్ శృతి హాసన్.. ప్రభాస్‌ సరసన నటిస్తోంది. కేజీఎఫ్‌ కి పది రెట్లు మించి సలార్‌ ఉంటుందని ప్రశాంత్‌ నీల్‌ అనౌన్స్‌ చేసినప్పటి నుంచి.. అందరిలోనూ అంచనాలు భారీ గా పెరిగాయి.

కొద్ది రోజులుగా ఈ సినిమా లో వెర్సటైల్‌ యాక్టర్‌ మనోజ్‌ బాజ్‌పేయి నటిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. సినిమా లో ఆయనది మెయిన్‌ విలన్‌ క్యారెక్టర్‌ అంటున్నారు. తాజాగా సలార్‌ టీం నుంచి అనౌన్స్‌ మెంట్‌ రాగా.. రాజమనార్‌ అనే పాత్ర ను రేపు ఉదయం 10.30 నిమిషాలకు రివీల్‌ చేయనున్నామని చెప్పుకొచ్చారు. అందరు మనోజ్‌ భాజ్‌ పాయ్‌ పోస్టర్‌ రిలీల్‌ చేస్తారని అనుకుంటున్నారు. కాగా.. ఇటీవలే ది ఫ్యామిలీ మ్యాన్‌ 2 సిరీస్‌ తో మరోసారి ప్రేక్షకులను మనోజ్‌ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news