కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన రాజస్థాన్‌ సీఎం

-

రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లోట్‌ చాతీ నొప్పి తో ఆస్పత్రి లో చేరారు. శుక్ర వారం ఉదయం ఆయనను జైపూర్‌ సవాయి మాన్‌ సింగ్‌ ఆస్పత్రి లో చేర్పించారు. 70 ఏళ్ల వయసున్న అశోక్‌ గెహ్లోట్‌… కరోనా సోకి తగ్గాక రకరకాల ఆరోగ్య సమస్య లతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు గురువారం అశోక్‌ గెహ్లోట్‌ ఛాతీ నొప్పికి గురి కాగా… ఈ ఉదయం ఆస్పత్రి లో చేర్పించారు కుటుంబ సభ్యులు.

ashok
ashok

పోస్ట్‌ కరోనా సమస్యలున్నా.. ఆయనకు వైద్యులు యాంజియోప్లాస్టీ నిర్వహించనున్నట్లు సమాచారం అందుతోంది. తన ఆరోగ్య స్థితి గతులపై స్వయంగా అశోక్‌ గెహ్లోట్‌ శుక్ర వారం ఉదయం ట్వీట్‌ కూడా చేశారు. ప్రస్తుతం తనకు బాగానే ఉందని పేర్కొన్న ఆయన… త్వరగా కోలుకుని ప్రజల ముందుకు వస్తానని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఇది ఇలా ఉండగా… అనారో్య పరిస్థితుల నేపథ్యం లో గెహ్లోట్‌ ఢిల్లీ పర్యటన రద్దు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news