రైతులకు బిగ్ షాక్..రుణమాఫీ మళ్లీ వాయిదా..!

-

తెలంగాణ లో రైతులకు మరోసారి బిగ్ షాక్ తగిలింది. రాష్ట్రంలో పంట రుణాలపై మాఫీని ప్రభుత్వం మరోసారి వాయిదా వేసింది. దళిత బంధు నిందులు సర్దుబాటు కాకపోవడం వల్లే రెండో విడత రుణ మాఫీ తాత్కాలికంగా నిలిపివేసినట్టు తెలుస్తోంది. ఇక ఆగస్ట్ 16 నుండి 26 వరకు నగదు బదిలీ చేసిన ప్రభుత్వం ఆ తర్వాత నిధులను విడుదల చేయలేదు. దాంతో రూ.50 వేల లోపు రుణ మాఫీ కి మరో రెండు నెలలు పట్టే అవకాశం ఉంది.

farmer
farmer

ఇదిలా ఉండగా తొలి ఏడాది నిధులు సర్దుబాటు కాకపోవడం తో వాయిదా పడగా…కరోనా వల్ల వచ్చిన సంక్షోభం కారణంగా మరో ఏడాదిన్నర వాయిదా వేశారు. ఇదిలా ఉండగా రుణమాఫీ సమయానికి అందక రైతులు ఆందోళన చెందుతున్నారు. చేసిన అప్పులకు వడ్డీలు పెరుగుతుండటం..మళ్ళీ పంటలు వేసేందుకు చేతిలో డబ్బులు లేకపోవడం తో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం త్వరగా రెండో విడత రుణమాఫీ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news