బెంగళూరులో భారీ పేలుడు.. ముగ్గురు మృతి : తునాతునకలైన శవాలు !

-

కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బెంగళూరు లోని.. చామరాజ పేట లో భారీ పేలుడు సంభవించింది. చామరాజ పేట లోని ఓ భవనం లో… భారీ పేలుడు సంభవించడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. అంతేకాదు ఈ ఘోర ప్రమాదంలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం అందుతోంది.

ఈ ప్రమాద ఘటన వివరాలు తెలుసుకున్న ఫైర్ సిబ్బంది మరియు పోలీసులు ఘటనా స్థలానికి.. హుటా హుటిన చేరుకున్నారు. ఆ భవనంలో చిక్కుకున్న క్షతగాత్రులను… బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు పోలీసు అధికారులు. అలాగే చెలరేగుతున్న మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తోంది ఫైర్ సిబ్బంది. అయితే ఈ ఘటనకు అసలు కారణాలు ఇంకా తెలియ రాలేదు. ఈ దారుణ ఘటన వెనుక ఎవరిదైనా హస్తం ఉందా ? అనేది తేలాల్సి ఉంది.  కాగా ఈ ఘోర ప్రమాదంలో కుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news