17వ తేదీన ”అలాయ్ బలాయ్” కార్యక్రమం : ముఖ్య అతిధిగా వెంకయ్యనాయుడు

-

తెలంగాణ రాష్ట్రం లో అలాయ్‌ బలాయ్‌ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు. ప్రతి ఏడాది దసరా పండుగ సమయం లోనే అలాయ్‌ బలాయ్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అయితే.. ఈ సారి బండారు దత్తాత్రేయ అందుబాటులో లేక పోవడం కారణంగా…. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ఆయన కూతురు విజయ లక్ష్మి చేతులతో మీదుగా నిర్వహించనున్నారు.

ఈ 17 వ తేదీన అలాయ్ బలాయ్ కార్యక్రమం నిర్వహిస్తామని.. జల విహార్ లో ఉదయం 10.30 గంటలకు ప్రారంభం అవుతుందని ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ కూతురు విజయ లక్ష్మి ప్రకటించారు.

అంతేకాదు… ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్ర పతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరు అవుతున్నారని తెలిపారు. అన్ని పార్టీ ల నేతలను ఆహ్వానించామని.. రెండు తెలుగు రాష్ట్రాల సీఎం లతో పాటు హర్యానా సీఎం ని కూడా అలాయ్ బలాయ్ కి ఆహ్వానించామని చెప్పారు. 2005 లో దత్తాత్రేయ గారు అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని ప్రారంభం చేశారని గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news