హైదరాబాద్ లో మాయమై గోదావరిలో శవమై తేలిన కాల్ సెంటర్ ఉద్యోగిని..అతడిపైనే అనుమానం..!

-

ఈనెల 12వ తేదీన హైదరాబాదులో మాయమైన ఓ కాల్ సెంటర్ ఉద్యోగిని మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద గోదావరిలో శవమై కనిపించడం కలకలం రేపింది. జనగాం కు చెందిన ఓ యువతి తల్లిదండ్రులతో కలిసి హైదరాబాద్ మల్కాజ్గిరి లో కొంతకాలంగా నివాసం ఉంటోంది. స్థానికంగా ఓ కాల్ సెంటర్లో యువతి ఉద్యోగం చేస్తోంది. అయితే ఈ నెల 12న ఆఫీస్ కు వెళ్తున్నా అని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువతి అదృశ్యమైంది. దాంతో ఆమె తండ్రి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కాగా మంచిర్యాల జిల్లా జైపూర్ లోని గోదావరిలో జాలర్లకు యువతి శవం కనిపించింది.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు గుర్తు తెలియని యువతి గా సోషల్ మీడియాలో షేర్ చేయగా యువతి తల్లిదండ్రులకు చేరింది. దాంతో వారు వెంటనే మంచిర్యాల చేరుకుని తమ కూతురిగా నిర్ధారించారు. అయితే బాధితురాలు బెల్లంపల్లి లో తన అమ్మమ్మ ఇంటి వద్ద ఇంటర్ పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో స్థానికంగా నివాసం ఉంటున్న సాధిక్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది.

అయితే తమ కూతురు అతడితోనే వెళ్లి ఉంటుందని భావించిన తల్లిదండ్రులు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు సాధిక్ కూడా నాలుగు రోజుల నుండి కనిపించక పోవడంతో అతని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా కూతురు గోదావరిలో శవమై తేలడంతో తమ కూతురిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేసి ఉంటారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అయితే సాధిక్ ఆచూకీ దొరికితే కానీ ఈ కేసులో అసలు విషయాలు బయటపడని పోలీసులు భావిస్తున్నారు. యువతి ఆత్మహత్య చేసుకుందా లేదంటే ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.crime

Read more RELATED
Recommended to you

Latest news