15 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి..? : షబ్బీర్ అలీ సంచలనం

-

అతి త్వరలోనే 15 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీ లోకి వస్తారని మాజీ మంత్రి వర్యులు షబ్బీర్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే లు… బీజేపీ నేతలు కాంగ్రెస్ కి టచ్ లో ఉన్నారని చెప్పారు. హుజూరాబాద్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ లోకి వలసలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు షబ్బీర్ అలీ.

కాంగ్రెస్ నుండి వెళ్ళిన ఎమ్మెల్యే లు వెనక్కి వచ్చేందుకు సిద్దంగా ఉన్నారని వెల్లడించారు. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే లు కూడా తనకు, పిసిసి చీఫ్ రేవంత్‌ రెడ్డి కి టచ్ లో ఉన్నారన్నారు. నిజామాబాద్ జిల్లా కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యే లు తనకు టచ్ లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

అధికార పార్టీ ఎమ్మెల్యే లకు జనంలో తిరుగుబాటు తప్పదని… కేటీఆర్ ఓ బచ్చా అని ఫైర్ అయ్యారు. హుజూరాబాద్ లో మొదట కొంత వెనకబడి ఉన్నా…పుంజుకుంటున్నామని చెప్పారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలుస్తామని స్పష్టం చేశారు షబ్బీర్ అలీ.

Read more RELATED
Recommended to you

Latest news