శ్రీకాకుళంలో ప్రేమ జంట అనుమానాస్పద మృతి..!

-

ప్రేమించుకున్నారు… కలకాలం కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. పెద్దలు పెళ్లికి నిరాకరించడం తో ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. ఇంతలో ఏమయ్యిందో కానీ విగత జీవులుగా ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించారు. వివరాల్లోకి వెళితే…. శ్రీకాకుళం జిల్లాలో ప్రేమజంట అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం తునివాడ గ్రామానికి చెందిన హరీష్ దివ్య అనే ఇద్దరు యువతీ యువకులు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు.

ఇటీవల వీరు పెళ్లి చేసుకుందాం అని నిశ్చయించుకొని పెద్దలను అడగగా వారు పెళ్లికి నిరాకరించారు. దాంతో హరీష్ దివ్యలు విశాఖపట్నంలోని ఆలయంలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. అయితే ఇంతలో ఏమైందో తెలియదు గానీ ఈ ప్రేమజంట ఇంట్లో ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. ప్రేమజంట మృతి చెందడంతో తునివాడ గ్రామంలో విషాదం నెలకొంది. ఈ కేసును పోలీసులు అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకుని విచారిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news