ఏపీలో కొన‌సాగుతున్న స్థానిక‌సంస్థ‌ల పోలింగ్…!

-

ఏపీ అనేక‌ కారణాల వల్ల వాయిదా పడిన స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ఈ రోజు జరుగుతోంది. మొత్తం 36 సర్పంచ్ ….68 వార్డు మెంబర్ స్థానాలకు ఈరోజు ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. ఉద‌యం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగనుంది. ఇక మధ్యాహ్నం రెండు గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించగా సాయంత్రం వరకు పూర్తి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ap local body elections
ap local body elections

ఇక స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల కోసం పోలీసులు భారీ బందోబ‌స్తును ఏర్పాటు చేశారు. ఇప్ప‌టికైతే ఎలాంటి అవాంచ‌నీయ ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా పోలింగ్ ప్ర‌శాంతంగా జ‌రుగుతుంది. ఇదిలా ఉండ‌గా 30సర్పంచ్ స్థానాలు అదే విధంగా 380 వార్డు మెంబ‌ర్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇక రేపు నెల్లూరు న‌గ‌ర‌పాల‌క సంస్థ‌తో పాటూ న‌గ‌ర‌పంచాయితీలు, 12 మున్సిపాలిటీల‌కు కూడా ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అదే విధంగా మంగ‌ళ‌వారం 10 జెడ్పీటీసీలు మ‌రియు 123 ఎంపీటీసీ స్థానాల‌కు పోలింగ్ జ‌ర‌గ‌నుంది.

Read more RELATED
Recommended to you

Latest news