ఆంధ్రప్రదేశ్ కు భారీ వర్షసూచన..మూడు రోజుల పాటూ!

-

ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఏపీలోని పలు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకున్నారు. భారీ వర్షాలతో పోటెత్తిన వరదల కారణంగా తీవ్రంగా ఆస్తినష్టం తో పాటు ప్రాణ నష్టం కూడా చోటు చేసుకుంది. రాయలసీమ జిల్లాల్లో ప్రాజెక్టులు తెగిపోవడం తో కొన్ని ఊర్లు నీట మునిగాయి. పంటలు నష్టపోయాయి. ఇదిలా ఉండగా రాష్ట్రంలో నేటి నుండి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఈరోజు నుండి రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అనంతపురం, కడప జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని..ప్రకాశం జిల్లాలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ లోని హైదరాబాద్ ప్రాంతంలో కూడా నేడు కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news