BREAKING : ఏపీలో తొలి ఒమిక్రన్ కేసు నమోదు

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ ఎంట‌ర్ అయిపోయింది. తాజాగా ఏపీలో ఒక ఒమిక్రాన్ కేసు న‌మోదు అయింది. ఐర్లాండ్ నుంచి విశాఖకు వచ్చిన ఓ వ్యక్తికి ఓమ్రికాన్ వైరస్ సోకినట్టు నిర్దారించింది ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ‌.

ap carona
ap carona

విజయనగరానికి చెందిన వ్య‌క్తిగా అధికారులు గుర్తించారు. ఒమిక్రాన్ పాజిటివ్ వ‌చ్చిన వ్య‌క్తి వ‌యస్సు 34 సంవ‌త్స‌రాలు ఉంటుంద‌ని వైద్యులు పేర్కొన్నారు. ఆ వ్య‌క్తి గ‌త నెల 27 వ తేదీన విశాఖ కు వ‌చ్చాడ‌ని.. దీంతో ఒమిక్రాన్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు అధికారులు. అయితే.. ఆ రిపోర్టు ఇవాళ రావ‌డంతో… అందుతో అత‌నికి ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్ధార‌ణ అయింది. దీంతో అతనికి వైద్య ప‌రీక్ష‌లు అందిస్తున్నారు అధికారులు. ఇక ఇటీవ‌ల ఏపీకి మ‌రో 15 మంది విదేశీయులు వ‌చ్చార‌ని.. వారికి ఒమిక్రాన్ ప‌రీక్ష‌లు చేస్తున్న‌ట్లు స్ప‌స్టం చేశారు అధికారులు. ఈ కేసు దేశ వ్యాప్తంగా.. 34 కు చేరాయి ఒమిక్రాన్ కేసులు. దీంతో మాస్కులు త‌ప్ప‌నిస‌రి వాడాల‌ని ఏపీ స‌ర్కార్ ఆదేశాలు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news