భారతి సిమెంట్ రూ.100కే అమ్మండి.. దేశ చరిత్రలో నిలవండి: టీడీపీ ఎమ్మెల్యే

-

తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే, సీనియ‌ర్ నాయ‌కుడు గోరంట్ల బుచ్చ‌య్య‌… ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి అదిరిపోయే కౌంట‌ర్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో సిమెంట్ బస్తా రేటు కూడా ₹100 కి తీసుకొచ్చి.. దేశ చరిత్రలోనే నిజంగా చిత్తశుద్ది ఉన్న ముఖ్యమంత్రి గా పేరు తెచ్చుకోండంటూ ట్వీట్ చేశారు గోరంట్ల బుచ్చ‌య్య‌.

సిమెంట్ బ్యాగ్ మీద మీ కమిషన్లు తగ్గించు కుంటే వాటి రేటు కూడా తగ్గుతాయని…పెద్ద హీరోలని తగ్గించుకోమన్నారు కదా… మీ కమిషన్ కూడా తగ్గించుకోవాల‌ని చుర‌క‌లు అంటించారు బుచ్చ‌య్య‌. అది కూడా మీ భారతి సిమెంటుతో మొదలు పెట్టి ఆదర్శంగా నిలవాల‌ని ఆయ‌న చుర‌క‌లు అంటించారు. అంతే కాకుండా ఉచితంగా ఇల్లు ఇస్తాము అని చెప్పి 5 బస్తాలు భారతి సిమెంటు ఖచ్చితంగా కొనాలి అనే దాంట్లో మర్మం కూడా ప్రజలకి చెప్పాలి ? అని ఎద్దేవా చేశారు గోరంట్ల బుచ్చ‌య్య‌.

Read more RELATED
Recommended to you

Latest news