డైరెక్టర్ల నుంచి నాకు ప్రాణహాని ఉంది : క‌రాటే క‌ళ్యాణి సంచ‌ల‌నం

-

నిన్న త‌న‌పై శివశక్తి ఫౌండేషన్ కేసు న‌మోదు చేయ‌డంపై క‌రాటే క‌ళ్యాణి సంచ‌ల‌న వ్యాక్య‌లు చేశారు. శివశక్తి ఫౌండేషన్ ఓ ధుష్టశక్తి అని.. అమాయక హిందువుల నుంచి విరాళాలు సేక‌రిస్తున్నార‌ని నిప్పులు చెరిగారు. వచ్చిన విరాళాలు సొంత అవసరాలకు మళ్ళించారని ఆరోపణలు చేశారు. శివశక్తి ఫౌండేషన్ లో పాత సభ్యుల సంతకాలు ఫోర్జరీ చేసి… నిధుల దారి మళ్ళింపు జ‌రుగుతుంద‌ని క‌రాటే క‌ళ్యాణి ఆరోప‌ణ‌లు చేశారు.

శివశక్తి ఫౌండేషన్ కార్యాలయం ఏర్పాటుకు రెండున్నర కోట్ల రూపాయల విరాళాలు వసూళ్ళు జ‌రిగాయ‌ని.. శివశక్తి అధ్యక్షుడు కరుణాకర్ సుగ్గున, డైరెక్టర్లు దేవిరెడ్డి ఆనందకుమార్ రెడ్డి, సునీతారెడ్డి లు నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని నిప్పులు చెరిగారు క‌రాటే క‌ళ్యాణి.

రెండున్నర కోట్ల రూపాయలు వసూలు చేసి…. సొంత అవసరాలకు వాడుకున్నారని.. \శివశక్తి ఫౌండేషన్ లో జరుగుతున్న అక్రమాలపై ప్రశ్నించినందుకు… తనపై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నన్ను ఆత్మహత్యకు ప్రేరేపిస్తున్నారు… శివశక్తి ఫౌండేషన్ అధ్యక్షుడు, డైరెక్టర్ల నుంచి నాకు ప్రాణహాని ఉందని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు క‌రాటే క‌ళ్యాణి. శివశక్తి ఫౌండేషన్ అక్రమాలపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశామ‌ని.. శివశక్తి ఫౌండేషన్ కు హిందువులు ఎవరూ విరాళాలు ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news