రాజమండ్రి నుండి 9 రోజులు ఉత్తర భారతదేశ యాత్ర…తక్కువ ధరకే ఈ ప్రదేశాలని చూసొచ్చేయండి..!

-

భారత్ దర్శన్ టూరిస్ట్ ద్వారా పర్యాటకుల్ని దేశంలోని వివిధ ప్రదేశాలకి తీసుకు వెళ్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఐఆర్‌సీటీసీ వివిధ ప్యాకేజీలని ఇప్పటికే ఎన్నో తీసుకు వచ్చింది. అయితే తాజాగా మరో ప్యాకేజీని తీసుకు వచ్చింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి నుంచి ‘ఉత్తర భారత్ దర్శన్ విత్ మాతా వైష్ణో దేవి’ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 2022 మార్చి 19న టూర్ ప్రారంభం అయ్యి 27 తో టూర్ ముగుస్తుంది. స్టాండర్డ్ ప్యాకేజీ ధర రూ.8510 కాగా, కంఫర్ట్ ప్యాకేజీ ధర రూ.10,400. ఈ టూర్ ప్యాకేజీ తో ఆగ్రా, మథుర, మాతా వైష్ణోదేవి, అమృత్‌సర్, హరిద్వార్ లాంటి ప్రాంతాలు చూడచ్చు.

మొదటి రోజు రాజమండ్రి, సామర్లకోట జంక్షన్, తుని, దువ్వాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పలాసలో భారత్ దర్శన్ టూరిస్ట్ రైలు ఎక్కచ్చు. రెండో రోజు ఆగ్రా చేరుకుంటారు. ఆగ్రా ఫోర్ట్, తాజ్ మహల్ ని మూడో రోజు చూసాక మథుర బయల్దేరాలి. అక్కడ కృష్ణ జన్మభూమి సందర్శన ఉంటుంది. ఆ తర్వాత శ్రీ మాతా వైష్ణోదేవి కాట్రాకు వెళ్ళాలి. రాత్రికి అక్కడే బస చేయాలి.

ఐదో రోజు వైష్ణోదేవి యాత్ర ఉంటుంది. హెలికాప్టర్ సర్వీస్ కావాలనుకుంటే పర్యాటకులు రెండు నెలలు ముందు సొంత ఖర్చులతో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆరో రోజు శ్రీ మాతా వైష్ణో దేవి దర్శనం ఉంటుంది. ఆ తర్వాత అమృత్‌సర్ స్టార్ట్ అవ్వాలి. గోల్డెన్ టెంపుల్, వాఘా బార్డర్ చూసాక హరిద్వార్ బయల్దేరాలి. ఏడో రోజు హరిద్వార్ చేరుకుంటారు.

అలానే మానస దేవి మందిర్ దర్శించుకోవచ్చు. సాయంత్రం గంగా హారతికి హాజరు కావొచ్చు.ఎనిమిదో రోజంతా ప్రయాణం ఉంటుంది. తొమ్మిదో రోజు ప్రయాణికులు పలాస, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, దువ్వాడ, తుని, సామర్లకోట జంక్షన్, రాజమండ్రి చేరుకోవడంతో టూర్ పూర్తి అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news