BREAKING : ఇవాళ మంత్రి పేర్ని నానితో ఆర్జీవీ భేటీ

-

ఇవాళ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ భేటీ కానున్నారు. ఏపీ సచివాల‌యంలో ఈ రోజు వీరిద్దరూ స‌మావేశం కానున్నారు. వివాదంగా మారిన సినిమా టికెట్ ధ‌ర‌ ల‌ పెంపుపై ఈ సమాశంలో సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ చ‌ర్చించనున్నారు.

ఇందులో భాగంగానే.. ఇవాళ ఉదయం హైదరాబాద్‌ నుంచి ప్లేన్‌ లో 11.45 గంటలకు విజయవాడ ఎయిర్‌ పోర్టు వెళ్లనున్నారు దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ. అలాగే.. అక్కడి నుంచి మధ్యాహ్నం 12 గంటలకు విజయవాడలోని సచివాలయానికి చేరుకోనున్నారు దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ. అనంతరం మంత్రి పేర్ని నానితో దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ భేటీ అవుతారు. వివాదంగా మారిన సినిమా టికెట్ ధ‌ర‌ ల‌ పెంపుపై ఈ సమాశంలో చర్చిస్తారు. అనంతరం సాయంత్రం 5 గంటల సమయంలో… హైదరాబాద్‌ తిరుగు ప్రయాణం కానున్నారు దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ.

Read more RELATED
Recommended to you

Latest news