బంగారు తెలంగాణ పేరుతో రాష్ట్రాన్ని చావుల తెలంగాణగా మారుస్తున్న హంతకుడు కేసీఆర్- వైఎస్ షర్మిళ

-

తెలంగాణ సీఎం కేసీఆర్ వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ సంచలన విమర్శలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. కేసీఆర్ ను హంతకుడిగా విమర్శలు చేశారు.

ట్విట్టర్ వేదికగా.. కీలక వ్యాఖ్యలు చేశారు వైఎస్ షర్మిళ.  ‘‘ అయితే నిరుద్యోగులు, లేకపోతే రైతులు, కాకపోతే ఉద్యోగులు.. బంగారు తెలంగాణ పేరుతో రాష్ట్రాన్ని చావుల కాష్టంగా తయారు చేసిన హంతకుడు కేసీఆర్ అని విమర్శించింది.

వైఎస్ ష‌ర్మిల‌ | Ys Sharmila
వైఎస్ ష‌ర్మిల‌ | Ys Sharmila

ఒకవైపు రోజుకు ఇద్దరు రైతులు ఆత్మహత్యలు చేసుకొంటుంటే, మరోవైపు జీవో 317 తో ఉద్యోగుల ఊపిరి తీస్తుంటే..దొరకు మాత్రం ఆ చావులను ఆపాలనే సోయి రావడం లేదంది. రైతు సంక్షేమం అంటే రైతులు పురుగుల మందు తాగి చచ్చేలా చేయడమా? అని ప్రశ్నించింది. కొట్లాడి తెచ్చుకొన్న తెలంగాణలో ఉద్యోగుల కాలికి ముళ్ళుదిగితే మునిపంటితో తీస్తాను అంటే వారిని సొంత ఊరునుంచి వెళ్లగొట్టి చంపడమా?  అని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఉద్యోగుల ఉసురు తీసుకుంటున్నారంటూ మండి పడింది. చేతకానీ సీఎం మనకొద్దు అంటూ మరోసారి విమర్శించింది.

Read more RELATED
Recommended to you

Latest news