కూకట్పల్లి: నడుచుకుంటూ వెళ్తున్న మహిళలే లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడి వద్ద నుంచి 2 తులాల బంగారు చైన్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం మేరకు.. కుర్ర రాజేష్ (34) అనే నిందితుడు చెడు అలవాట్లకు బానిసగా మారి దొంగతనాలకు పాల్పడుతున్నాడని తెలిపారు. నిందితుడిపై కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కేసులు నమోదై ఉన్నాయన్నారు.
చైన్ స్నాచర్ అరెస్ట్.. రిమాండ్కు తరలింపు
By Naga Babu
-
Previous article
Next article