న్యూస్ ఛానెల్ డిబెట్ లో యువతి డ్యాన్స్… వీడియో వైరల్..

-

టీవీ డిబేట్ లో ఏదో ఒక అంశం పైన మాట్లాడటం మనం చూస్తూనే ఉంటాం. అయితే ప్యానెల్ లో కూర్చున్నా వ్యక్తులు తమ అభిప్రాయాలను గట్టిగా వినిపిస్తున్నారు. తమ అభిప్రాయం నెగ్గాలని కోరుకుంటున్నారు. ఇదే సమయంలో అవతలివాళ్ళు మాట్లాడకుండా అడ్డు పడటం కూడా మనం చూస్తుంటాం. ఒక్కో సమయంలో ప్యానెల్ లో కూర్చున్న వ్యక్తులు ఒకరిపైన ఒకరు అరుచుకోవడం ఈమధ్య సింపుల్ అయిపోయింది. ఒక్కోసారి ఒకరినొకరు కొట్టుకోవడం కూడా చూశాం. అయితే తాజాగా తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఏకంగా యువతి టీవీ ఛానల్ లైవ్ లో నే డాన్స్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఘటన బెంగాలీ న్యూస్ ఛానల్ లో జరిగింది. ఈ వీడియో పాతది అయినప్పటికీ ప్రస్తుతం వైరల్ గా మారింది. నెటిజన్లకు నవ్వులు కురిపిస్తుంది.

దీపావళి సందర్భంగా టపాకాయలు కాల్చాలా.. వద్దా అని సదరు న్యూస్ ఛానల్ డిబెట్ పెట్టింది. అయితే ఇందులో పర్యావరణ కార్యకర్త రోష్నీఅలీ మాట్లాడడానికి సమయం ఇవ్వకపోవడంతో… డాన్స్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాలనుకుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.కరోనా సమయంలో పటాకులను నిషేధించాలని కోరుతూ రోష్నీ అలీ కలకత్తా హైకోర్టులో పిల్ దాఖలు చేసింది. దీనిపై సదరు బెంగాళీ న్యూస్ ఛానెల్ డిబేట్ నిర్వహించిన క్రమంలో ఈ ఫన్నీ సీన్ జరిగింది. దీనిపై నెటిజెన్ల పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news