సిద్ధిపేట: బైక్‌ను ఢీకొట్టిన లారీ.. ఒకరు స్పాట్ డెడ్

-

అక్కన్నపేట మండలం అంతకపేట గ్రామంలో బైక్‌ను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. కట్కూర్‌ గ్రామానికి చెందిన పులిసురేష్‌(40) బైక్‌పై హుస్నాబాద్‌కు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొంది. సురేష్‌ తలకు తీవ్ర గాయాలు కాగా అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య సునీత,కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news