చంద్రబాబు గేట్ తాకితే కొడాలి నాని శవాన్ని పంపుతా : బుద్దా వెంకన్న

-

చంద్రబాబు గేట్ తాకితే కొడాలి నాని శవాన్ని పంపుతానని హెచ్చరించారు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బుద్దా వెంకన్న. షర్మిల ఏపీలో పార్టీ పెడితే, అందులో చేరి జగన్ను బూతులు తిట్టే మొదటివ్యక్తి కొడాలినాని అని.. ప్రజలకు మేలు చేయటం చేతకాకే.. చంద్రబాబుపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని నిప్పులు చెరిగారు. గుడివాడలో బస్సులు, లారీల్లో కొడాలి నాని ఆయిల్ దొంగతనం చేస్తే, అప్పుడు పోలీసు అధికారిగా ఉన్న వర్ల రామయ్య చర్యలు తీసుకోలేదా..? అని ప్రశ్నించారు.

budda venkanna
budda venkanna

చంద్రబాబు సీఎం అయ్యాకే కొడాలి నానికి టీడీపీలో స్థానంలో దక్కిందని… హరికృష్ణ గుడివాడలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే, మధ్యలో వదిలేసి పారిపోయిన వ్యక్తి కొడాలి నాని అని పేర్కొన్నారు. కొడాలి నాని లేదా మరెవ్వరైనా చంద్రబాబు గురించి మాట్లాడితే మేం జగన్ గురించి 10రేట్లు మాట్లాడతామని… జోగి రమేష్ లా మళ్లీ చంద్రబాబు ఇంటి వైపు ఎవరైనా చూస్తే చావకొట్టి పంపుతామని వెల్లడించారు. డీజీపీకి కూడా కొడాలినాని నిర్వహించిన క్యాసినోలో వాటాలు ఉన్నందుకే కేసు తొక్కిపెట్టారని.. డైరెక్టర్ ఆఫ్ జగన్ పార్టీగా డీజీపీ వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news