ఏపీలో ప‌లువురు ఐఏఎస్‌ల బ‌దిలీ

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో ప‌లువురు ఐఏఎస్ ల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం బ‌దిలీ చేసింది. బ‌దిలీలకు సంబంధించిన ఉత్త‌ర్వుల‌ను కూడా ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం జారీ చేసింది. ఈ ఉత్త‌ర్వ‌ల ప్ర‌కారం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా కలెక్ట‌ర్ గా ప్ర‌స‌న్న వెంక‌టేశ్ నియ‌మించారు. రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శిగా కె. సునీత ను నియ‌మించారు. ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర కాపు కార్పొరేష‌న్ ఎండీగా రేఖా వాణీని నియ‌మించారు. రాష్ట్ర కార్మిక శాఖ ప్ర‌త్యేక క‌మిష‌న‌ర్ గా కార్తికేయ మిశ్రా ను నియ‌మించారు.

రాష్ట్ర సంఘిక సంక్షేమ శాఖ ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శిగా గంధం చంద్రుడు ను బ‌దిలీ చేశారు. అలాగే విజ‌య వాడ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ క‌మిష‌న‌ర్ గా రంజిత్ బాషా ను నియ‌మింస్తు ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. కాగ గ‌త కొద్ది రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల‌లో ఐఏఎస్, ఐపీఎస్ బ‌దిలీలు జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టి కే తెలంగాణ రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ తో పాటు ప‌లువురు ఉన్న‌త శ్రేణి ఉద్యోగుల‌ను ప్ర‌భుత్వం బ‌దిలీ చేసింది. తాజా గా ఆంధ్ర ప్ర‌దేశ్ లో కూడా బ‌దిలీల ప‌ర్వం ఊపందుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news