ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన కారు.. న‌లుగురు మృతి

-

ఆగి ఉన్న లారీని ఒక కారు ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో కారులో ప్ర‌యాణిస్తున్న న‌లుగురు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. ఈ దారుణ‌మైన ఘ‌ట‌న ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలోని చిత్తూర్ జిల్లా చంద్ర‌గిరి మండ‌లంలోని ఐతేప‌ల్లి వ‌ద్ద చోటు చేసుకుంది. మృతుల్లో ఇద్ద‌రు చిన్నారులు ఉన్నారు. అలాగే ఒక మ‌హిళ కూడా ఉన్నారు. మ‌రొక‌రు మ‌రణించారు. కాగ కారు డ్రైవ‌ర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. కాగ స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు.

దీంతో చిత్తూర్ జిల్లా పోలీసులు ప్ర‌మ‌దం జ‌రిగ‌న స్థ‌లానికి చేరుకున్నారు. మృతులు అంద‌రూ కూడా విశాఖ ప‌ట్నానికి చెందిన వారికి గా పోలీసులు గుర్తించారు. కాగ కారులో విశాఖ నుంచి కాణిపాకం వెళ్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు.. గాయ ప‌డ్డ కారు డ్రైవ‌ర్ ను ఆస్పత్రికి త‌ర‌లించారు. అలాగే మృత దేహాల‌ను కారులో నుంచి బ‌య‌ట‌కు తీశారు. అలాగే పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ప్ర‌మాదం గురించి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news