శ్రీవారి భక్తులకు శుభవార్త.. టికెట్ల ధరల పెంపుపై టీటీడీ కీలక ప్రకటన

-

సామాన్య భక్తులకు సర్వదర్సనం ప్రారంభించి పదిరోజులవుతోందని.. రెండు సంవత్సరాల తరువాత సర్వదర్సనాన్ని ప్రారంభించామని టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. సర్వదర్శనం ప్రారంభమైన తరువాత భక్తుల రద్దీ గణనీయంగా పెరిగిందని.. భక్తుల రద్దీ పెరిగినా అన్నప్రసాదం వద్ద ఎలాంటి ఇబ్బందులు రానివ్వడం లేదన్నారు.

తిరుమలలోని మరో రెండు ప్రాంతాల్లో అన్నప్రసాదాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని.. ఆర్జిత సేవలను పునఃప్రారంభించేందుకు సమయం పడుతుందని టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి వెల్లడించారు. త్వరలోనే ప్రారంభించడానికి కసరత్తు చేస్తున్నామని.. ఏప్రిల్ నుంచి అన్ని సేవలను ప్రారంభించేందుకు ప్రయత్నం చేస్తున్నామని ప్రకటన చేశారు.

ఏ సేవల ధరలను పెంచే ఆలోచన టిటిడికి లేదని… ఆర్జిత సేవల ధరలను పెంచే ఆలోచన ఇప్పట్లో లేదని తేల్చి చెప్పారు. ధరల పెంపుపై కేవలం చర్చ మాత్రమే పాలకమండలిలో జరిగిందని.. సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించడమే టిటిడి పాలకమండలి ముఖ్య ఉద్దేశమన్నారు. విఐపి దర్సనాలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి ప్రకటన చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news