డీఎస్ తనయుడికి బెయిల్ మంజూరు

-

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ డీఎస్ కుమారుడు  ధర్మపురి సంజయ్ కి జిల్లా కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. నిజామాబాద్ శాంకరీ నర్సింగ్ కళాశాల విద్యార్థినీలు సంజయ్ లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే..దీంతో పోలీసులు నిర్భయ చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. దీంతో ఆయన నేటి వరకు 18 రోజుల పాటు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. జిల్లా కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో ఆయన శుక్రవారం ఉదయం విడుదలయ్యే అవకాశం ఉంది. విచారణ అధికారి అనుమతి లేకుండా నిజామాబాద్ విడిచి వెళ్లొద్దని, ప్రతి సోమవారం, గురువారం పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలని ఆదేశించింది. సంజయ్ పై 342,354, 354ఏ, 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news