ఆరోగ్య మిత్రాల‌కు జ‌గ‌న్ గుడ్ న్యూస్.. ఇక న‌గ‌దు ప్రోత్సాహ‌కాలు

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఉన్న ఆరోగ్య మిత్రాల‌కు వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వ‌లంటీర్ల లాగే.. మంచి ప్ర‌తిభ క‌న‌బ‌ర్చిన ఆరోగ్య మిత్రాల‌కు కూడా న‌గ‌దు ప్రోత్సహ‌కాలు ఇస్తామ‌ని ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌క‌టించారు. ఆరోగ్య మిత్రాల‌కు న‌గ‌దు ప్రోత్స‌హకాలు అందించాల‌ని సంబంధిత అధికారుల‌ను సీఎం వైఎస్ జ‌గ‌న్ ఆదేశాలు జారీ చేశారు. ఆరోగ్య మిత్రాల‌కు న‌గ‌దు ప్రోత్స‌హ‌కాలు ఇవ్వ‌డం వ‌ల్ల‌.. వారు చేస్తున్న సేవ‌ల‌ను గుర్తించినట్లు అవుతుంద‌ని సీఎం జ‌గ‌న్ అన్నారు.

CM Jagan Mohan Reddy
CM Jagan Mohan Reddy

దీంతో వారు ప్ర‌జ‌ల‌కు మ‌రింత సేవ చేసే అవ‌కాశం కూడా ఉంటుంద‌ని అన్నారు. అలాగే మే నెల చివ‌రి క‌ల్లా.. రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో అన్ని నియామ‌కాల‌ను పూర్తి చేయాల‌ని ఆదేశాలు జ‌రీ చేశారు. నియామ‌కాల విషయంలో ఎలాంటి జాప్యం జ‌ర‌గ‌కూడద‌ని స్ప‌ష్టం చేశారు. అలాగే రాష్ట్రంలో వైద్యులకు ఇచ్చే జీతాల విషయంలో కూడా ఎలాంటి జాప్యం చేయ‌కూడ‌ద‌ని సంబంధిత అధికారుల‌కు సీఎం వైఎస్ జ‌గ‌న్ సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news