ఆర్టీసీ బస్సులో బట్టలు విప్పేసిన మహిళ..షాకైన కండక్టర్

-

హైదరాబాద్ లోని మలక్ పేట్ ప్రాంతంలో బస్సులో ఓ మహిళ వీరంగం సృష్టించింది.తోటి ప్రయాణీకులను కొడుతూ హల్ చల్ చేసింది.అంతటితో ఆగకుండా తన మూడేళ్ల కూతుర్ని బస్సు కిటికీలోంచి కిందకు విసిరేసింది.వివరాల్లోకి వెళితే..ఓ మహిళ(37) తన మూడేళ్ల కూతురు తో ఇంటికి వెళ్లడానికి అఫ్జల్గంజ్ లో రాత్రి 7 గంటలకు బస్సు ఎక్కింది.అక్కడ నుంచి ఎల్బీనగర్ కు టికెట్ తీసుకొని వస్తుండగా…ఎంజీబీఎస్ కు రాగానే ఆమె బస్సులో గొడవ చేయడంం మొదలుపెట్టింది.బట్టలు ఊడదీసుకోవడం, పక్కన ఉన్న వారిని దూషిస్తూ కొడుతూ కలకలం రేపింది.గమనించిన కండక్టర్ ఇదేంటని ప్రశ్నించగా అతడిపై కూడా చేయి చేసుకుంది.

అనంతరం తన కుమార్తెను బస్సు కిటికీ నుంచి విసిరేయడానికి ప్రయత్నించగా ప్రయాణికులు అడ్డుకున్నారు.ఇదంతా చూసి అప్రమత్తమైన డ్రైవర్ మలక్ పేట పోలీస్ స్టేషన్ ఎదురుగా బస్సు ఆపాడు.బస్సు డోర్ నుంచి పాపను కిందికి విసిరేసింది.బస్సు టైర్ల కింద కూర్చుంది.అదృష్టవశాత్తు పాపకు ఎలాంటిి గాయాలు కాలేదు.కండక్టర్ పోలీసులకు ఈ విషయం చెప్పాడు.దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news