బొత్స గారు… ముందు మీరు కరెంట్‌ బిల్‌ కట్టండి – తెలంగాణ విద్యుత్‌ శాఖ

-

తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు ఏపీలో రాజకీయల్లో హాట్‌ టాపిక్‌ గా మారాయి. ఏపీ మంత్రులు కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. వరుసగా వైసీపీ నేతలు కేటీఆర్‌ పై దాడి చేస్తున్నారు. అయితే మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ లో కరెంటు సరిగా ఉండదని… జనరేటర్ వేసుకొని ఉండి వచ్చానని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు.

అయితే దీనిపై తెలంగాణ విద్యుత్ శాఖ తన స్టైల్లో స్పందించింది. “మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము. మీరు కరెంటు బిల్లు క్లియర్ చేసిన వెంటనే మీ ఇంటికి కరెంటు సరఫరా చేస్తాం. 15 నెలలుగా మీరు బిల్లు చెల్లించలేదు. అందుకే కరెంట్ కట్ చేశాము”అంటూ బొత్స సత్యనారాయణకు ట్విట్టర్ వేదికగా విద్యుత్ శాఖ కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. కాగా.. కేటీఆర్‌ తాను చేసిన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు. తాను ఏపీని ఉద్దేశించి అనలేదంటూ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news