ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రేపు, ఎల్లుండి జాబ్ మేళా

-

అమరావతి : ఏపీ నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది అధికార వైసీపీ పార్టీ. నాగార్జున యూనివర్సిటీలో రెండు రోజుల పాటు వైసీపీ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళ నిర్వహించనుంది జగన్‌ మోహన్ రెడ్డి సర్కార్‌. ఈ మేరకు జాబ్ మేళను వైసీపీ పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ విజయ సాయిరెడ్డి పర్యవేక్షించారు. రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు జాబ్ మేళ ఉంటుందని విజయ సాయిరెడ్డి ప్రకటన చేశారు.

ఇప్పటికే రాష్ట్రంలో రెండు చోట్ల తిరుపతి, విశాఖల్లో జాబ్ మేళాల నిర్వహించినట్లు స్పష్టం చేశారు విజయ సాయిరెడ్డి. పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లాల్లో నిరుద్యోగులకు జాబ్ మేళ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే.. ఇవాళ యూనివర్సిటీలో జాబ్ మేళా ఏర్పాట్లను పరిశీలించారు విజయ సాయిరెడ్డి. ఆయనతో పాటు పలువురు ఎమ్మెల్సీలు, ఇతర నేతలు పాల్గొన్నారు. కాగా.. గత నెలలో కూడా వైసీపీ సర్కార్‌ జాబ్‌ మేళా నిర్వహించి… దాదాపు 15 వేల మందికి ఉపాధిని కల్పించింది.

Read more RELATED
Recommended to you

Latest news