‘‘మేజర్’’ అప్‌డేట్ ఇచ్చేసిన అడివి శేష్..ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే?

-

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ నటించిన తాజా చిత్రం ‘‘మేజర్’’ వచ్చే నెల3న విడుదల కానుంది. ‘గూఢచారి’ ఫేమ్ శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కిన బయోగ్రాఫికల్ యాక్షన్ ఫిల్మ్ అయిన ‘మేజర్’లో హీరోయిన్స్ గా సాయి మంజ్రేకర్, శోభితా దూళిపాళ్ల నటించారు. మురళీశర్మ, ప్రకాశ్ రాజ్, రేవతి కీలక పాత్రలు పోషించారు.

2008లో జరిగిన 26/11 అటాక్ లో పోరాడిన ఇండియన్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ లైఫ్ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. సోనీ పిక్చర్స్ ఫిల్మ్ ఇండియా, ఏ ప్లస్ ఎస్ మూవీస్, జీఎంబీ ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ ఫిల్మ్ ను ప్రొడ్యూస్ చేశాయి.

ఈ సినిమాను ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రివ్యూగా వేశారు. అక్కడ చక్కటి స్పందన లభించింది. కాగా, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తాజాగా అడివి శేష్ అనౌన్స్ చేశారు. ఏపీలోని వైజాగ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నట్లు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పోస్టర్ రిలీజ్ చేశారు అడివి శేష్.

Read more RELATED
Recommended to you

Latest news