ఎయిర్‌టెల్ బంప‌ర్ ఆఫ‌ర్‌.. రూ.249 ప్రీపెయిడ్ ప్లాన్‌తో రూ.4 ల‌క్ష‌ల లైఫ్ ఇన్సూరెన్స్ ఫ్రీ..!

-

ఎయిర్‌టెల్‌కు చెందిన ప్రీపెయిడ్ క‌స్ట‌మ‌ర్లు రూ.249తో రీచార్జి చేసుకుంటే వారికి రూ.4 ల‌క్ష‌ల విలువైన లైఫ్ ఇన్సూరెన్స్ ఉచితంగా ల‌భిస్తుంది.

మ‌న దేశంలో టెలికాం సంస్థ‌ల మ‌ధ్య ఎంత‌టి పోటీ ఉందో అంద‌రికీ తెలిసిందే. ఒక‌రిని మించి మ‌రొక‌రు ప్లాన్‌లు, రీచార్జి ప్యాక్‌ల‌ను ప్రవేశ‌పెడుతూ క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఓ వైపు జియో ఆక‌ర్ష‌ణీయ‌మైన డేటా ప్లాన్లు, డిస్కౌంట్ల‌తో వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకుంటుంటే.. మ‌రో వైపు టెలికాం సంస్థ భార‌తీ ఎయిర్‌టెల్ కూడా అదే బాటలో ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త ప్లాన్ల‌ను, ఆఫ‌ర్ల‌ను అందిస్తూ వ‌స్తోంది. ఈ క్ర‌మంలోనే ఎయిర్‌టెల్ ఇవాళ మ‌రో కొత్త ఆఫ‌ర్‌ను త‌న క‌స్ట‌మ‌ర్ల‌కు అందుబాటులోకి తెచ్చింది. అదేమిటంటే…

ఎయిర్‌టెల్‌కు చెందిన ప్రీపెయిడ్ క‌స్ట‌మ‌ర్లు రూ.249తో రీచార్జి చేసుకుంటే వారికి రూ.4 ల‌క్ష‌ల విలువైన లైఫ్ ఇన్సూరెన్స్ ఉచితంగా ల‌భిస్తుంది. ఒక‌సారి ఈ ప్లాన్‌ను రీచార్జి చేసుకుంటే క‌స్ట‌మ‌ర్ల‌కు హెచ్‌డీఎఫ్‌సీ లేదా భార‌తీ ఆక్సా నుంచి పాల‌సీ వివ‌రాలు ఎస్ఎంఎస్ రూపంలో వ‌స్తాయి. అనంతరం వారు కేవైసీ చేసుకుంటే పాల‌సీ ల‌భిస్తుంది.

ఇక రూ.249 ప్లాన్‌లో క‌స్ట‌మ‌ర్ల‌కు అన్‌లిమిటెడ్ కాల్స్‌, రోజుకు 2జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు, ఎయిర్‌టెల్ టీవీ ప్రీమియం, వింక్ మ్యూజిక్ సేవ‌లు ల‌భిస్తాయి. ఇక ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు కాగా దీంతోపాటు వినియోగ‌దారులు వాడే స్మార్ట్‌ఫోన్‌కు నార్ట‌న్ మొబైల్ సెక్యూరిటీ స‌బ్‌స్క్రిప్ష‌న్ ఉచితంగా ల‌భిస్తుంది. ఏది ఏమైనా.. జియోకు పోటీనివ్వ‌డానికి ఎయిర్‌టెల్ ఓ సరికొత్త ఆఫ‌ర్‌ను అందుబాటులోకి తెచ్చింది. మ‌రి ఈ ఆఫ‌ర్‌తో ఎయిర్‌టెల్ వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకుంటుందా, లేదా.. అన్న‌ది వేచి చూస్తే తెలుస్తుంది..!

Read more RELATED
Recommended to you

Latest news