కెసిఆర్ తీరు వెయ్యి ఎలుకలను తిన్న పిల్లి పుణ్యం కోసం కాశీకి వెళ్లినట్టుంది: తరుణ్ చుగ్

-

సీఎం కేసీఆర్ తీరు వెయ్యి ఎలుకలను తిన్న పిల్లి పుణ్యం కోసం కాశీకి వెళ్ళినట్టు ఉందని ఎద్దేవా చేశారు తెలంగాణ బీజేపీ ఇంచార్జ్ తరుణ్ చుగ్.శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… బంగారు తెలంగాణ చేస్తానని చేయలేకపోయాడు, దాని నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే జాతీయ రాజకీయ నినాదం ఎత్తుకున్నాడని తరుణ్ చుగ్ విమర్శలు గుప్పించారు. దేశంలో వేలాది పార్టీలు ఉన్నాయని, ఆయనకు కూడా జాతీయ పార్టీ రిజిస్ట్రేషన్ చేసుకునే హక్కు ఉందన్నారు.

ఫామ్ హౌస్ లో కూర్చుని సీఎం కేసీఆర్ పగటికలలు కంటున్నారని అన్నారు. తెలంగాణలో మహిళలపై ఘోరమైన రేపులు జరుగుతున్నాయని, వాటిని అరికట్టడం పై సీఎం కేసీఆర్ దృష్టి పెట్టాలని సూచించారు. ప్రభుత్వ వాహనాలలో అత్యాచారం జరిగిందని, ముఖ్యమంత్రి వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news