జగన్‌కు బుల్లెట్ ప్రూఫ్ కాన్వాయ్

-

ఏపీ కొత్త సీఎం జగన్‌కు ప్రభుత్వం భద్రత పెంచుతోంది. త్వరలో ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైఎస్ జగన్‌కు ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ కాన్వాయ్‌ను ఏర్పాటు చేసింది. బుల్లెట్ ప్రూఫ్ కాన్వాయ్‌లో ఆరు కొత్త వాహనాలు ఉన్నాయి.

ఇక.. గుంటూరు జిల్లాలోని తాడేపల్లిలో ఉన్న జగన్ నివాసాన్ని.. అక్కడ చుట్టుపక్కల ప్రాంతాన్ని కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. వెంటనే జగన్‌కు వ్యక్తిగత భద్రతా సిబ్బందిని పెంచారు. ప్రస్తుతం జగన్‌కు జెడ్ కేటగిరీ భద్రతను అందిస్తున్నారు. ఇవాళ జరిగే శాసనసభాపక్ష సమావేశం సందర్భంగా జగన్ క్యాంపు కార్యాలయం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news