టిపిసిసిగా ఏడాది పూర్తి చేసుకున్న రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్

-

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ( టిపిసిసి) అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టి గురువారం ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ఆసక్తికర ట్వీట్ ను పోస్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, వాద్రా లతో కలిసి ఉన్న ఫోటోలతో పాటు టీ పీసీసీ అధ్యక్షుడిగా తాను పదవి బాధ్యతలు తీసుకుంటున్న ఫోటోలు సదరు ట్వీట్ కి జతచేశారు.

తనపై నమ్మకం ఉంచి పార్టీ అధినాయకత్వం కీలక బాధ్యతలు అప్పగించిందని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ట్వీట్ ని చూసిన పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి గీతారెడ్డి ఆయనను అభినందిస్తూ ఓ ట్వీట్ చేశారు. పార్టీకి చెందిన ఇతర నేతలు, కార్యకర్తలనుంచి కూడా రేవంత్ రెడ్డి కి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news