BREAKING : తెలంగాణ ఎంసెట్ ఎగ్జామ్స్ వాయిదా

-

తెలంగాణ విద్యార్థులకు బిగ్‌ అలర్ట్. తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ ప్రకారం నిర్వహించబోమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు రోజులు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేస్తున్నామని…సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు.


షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని… అనుకున్నప్పటికీ.. వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేశారు. జూలై 14, 15 తేదీల్లో జరిగే ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షలు వాయిదా వేస్తున్నామని ప్రకటించారు. అయితే… జూలై 18, 19, 20 తేదీల్లో ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ మాత్రం యథావిధంగా జరుగుతున్నట్లు వివరించారు సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్.

Read more RELATED
Recommended to you

Latest news