పార్టీ మారడంపై ఒంగోలు ఎంపీ మాగుంట క్లారిటీ

-

పార్టీ మారబోతున్నారు అంటూ వచ్చిన వార్తలపై ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులు క్లారిటీ ఇచ్చారు. సీఎం జగన్ తో మాగుంట కుటుంబానికి మనస్పర్ధలు ఎక్కువయ్యాయని, అందుకే మాగుంట పార్టీ మారుతున్నట్లు పుకార్లు చెలరేగాయి. అయితే అటువంటివి లేవన్నారు మాగుంట శ్రీనివాసులరెడ్డి. 2024 ఎన్నికల్లో కూడా మాగుంట కుటుంబం వైసీపీ పార్టీ నుండి పోటీ చేస్తుందని తెలిపారు.

తమ కుటుంబం 32 సంవత్సరాల నుంచి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఉందని తెలిపారు. తన సోదరుడు మాగుంట సుబ్బరామిరెడ్డి తొలిసారి ఇక్కడి నుండి గెలిచిన తర్వాత ఇక వెనుతిరిగి వెళ్లలేదన్నారు. తాను మూడుసార్లు ఒంగోలు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించానని తెలిపారు. మాగుంట కుటుంబ సభ్యులందరూ జగన్ అభిమానులు, శ్రేయోభిలాషులేనని అన్నారు. జిల్లాలో ఉన్న వైసీపీ నాయకులతో కూడా మాగుంట కుటుంబానికి ఎలాంటి విభేదాలు లేవని అన్నారు. అందరితో కలిసి పనిచేస్తున్నామని, ప్రజల తమ కుటుంబాన్ని ఆదరిస్తూ వస్తున్నారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news