మహేష్ హీరోయిన్ తల్లి కాబోతోందా.. ఇందులో నిజమెంత..!!

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరో మహేష్ బాబుతో నటించాలని ఎవరికైనా కోరిక ఉంటుంది. అలా గతంలో మహేష్ బాబుతో కలిసి టక్కరి దొంగ సినిమాలో మహేష్ సరసన నటించి ప్రేక్షకులను మెప్పించింది బిపాసా బసు. అయితే ఆ తరువాత ఈమె ఏ తెలుగు సినిమాలో ఎక్కడా కూడా నటించలేదు. అయితే బాలీవుడ్ లో మాత్రం బోల్డ్ రోల్స్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది ఈ ముద్దుగుమ్మ. ఇక బాలీవుడ్ లో రాజ్ జిస్మ్, ధూమ్-2, రేస్ వంటి చిత్రాలలో నటించింది. అయితే ఈమె కెరియర్ బాగా పీక్స్ లో ఉన్న సమయంలో సినిమాలకు దూరమయింది.అయితే ఆ తర్వాత కరణ్ సింగ్ గ్రోవర్ అనే నటుడిని వివాహం చేసుకొని స్థిరపడింది.తాజాగా ఆమెకు సంబంధించి ఒక వార్త నెట్టింట వైరల్ గా మారుతోంది వాటి గురించి చూద్దాం.బిపాసా బసు, కరణ్ సింగ్ గ్రోవర్ ఇద్దరూ తల్లిదండ్రులు కాబోతున్నారనే వార్త బాలీవుడ్ మీడియాలో బాగా వినిపిస్తోంది. త్వరలోనే వీరు ఒక పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు బాలీవుడ్ లో గుసగుసలు బాగా వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించి అధికారికంగా త్వరలోనే వీరు తెలియపరుచునున్నట్లు సమాచారం అందుతోంది. ఇక డైరెక్టర్ భూషణ్ పటేల్ తెరకెక్కించిన ఎలోన్ చిత్రం ద్వారా బిపాసా బసు, కరణ్ సింగ్ ఈ సినిమాలో జతగా నటించారు. ఈ చిత్రం షూటింగ్ చేస్తున్న సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం బాగా ఏర్పడింది . ఆ తర్వాత ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది.

ఇక దీంతో వీరు వివాహం కాకముందే ఒక ఏడాది పాటు డేటింగ్ లో ఉన్నారు. ఇక తర్వాత 2016 వ సంవత్సరంలో ఇద్దరి తల్లిదండ్రులను ఒప్పించి పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. అయితే గతంలో కూడా 2016లో బిపాసా ప్రెగ్నెంట్ అనే విషయం బాగా వైరల్ గా మారింది కానీ ఈ వదంతులపై ఆమె ఘాటుగానే స్పందించింది. మరి ఇప్పుడు వస్తున్న వార్తలపై ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Latest news