పోలీసుల అదుపులో జనశక్తి నేత కూర రాజన్న

-

జనశక్తి అగ్రనేత కూర రాజన్న అలియాస్ (KR) ను సోమవారం హైదరాబాదులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిరిసిల్ల జిల్లా పోలీసులు రాజన్నను అరెస్టు చేసిన విషయాన్ని అరుణోదయ గౌరవాధ్యక్షురాలు, ప్రజా గాయని విమలక్క తెలిపారు. అయితే అరెస్టు చేసిన విషయాన్ని పోలీసులు అత్యంత గోప్యంగా ఉంచారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కోనరావుపేట మండలంలోని సుద్దాల గ్రామానికి చెందిన సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు ప్రభాకర్ రావు హత్య కేసులో 2013లో కూర రాజన్నకు వారెంట్ జారీ అయింది.

ఈ కేసులో గతంలో అరెస్ట్ అయిన రాజన్న జైలుకు వెళ్లి బెయిల్ పై విడుదలయ్యారు. అయితే మళ్లీ కోర్టుకు హాజరు కాకపోవడంతో రాజన్న పై నాన్ బేలబుల్ వారంట్ జారీ అయింది. అయితే రాజన్న అరెస్టును ఖండిస్తూ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ సెంట్రల్ కమిటీ ప్రధాన కార్యదర్శి చంద్రన్న ఓ ప్రకటన విడుదల చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న రాజన్నను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news