సొంత ఇంటికి వచ్చిన ఫీలింగ్ ఉంది – దాసోజు

-

భారతీయ జనతా పార్టీలో దాసోజు శ్రవణ్ కుమార్ చేరారు. బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్ సమక్షంలో బిజెపిలో చేరారు దాసోజు శ్రవణ్. ఈ జాయినింగ్ కార్యక్రమానికి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి, బిజెపి ఎంపీ లక్ష్మణ్, మురళీధర్ రావు హజరు అయ్యారు.

ఈ సందర్భంగా దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ…ఆరెస్సెస్ స్వయం సేవక్ గా పనిచేశా..విద్యార్థిగా ఎబివిపి లో పనిచేశానని గుర్తు చేశారు దాసోజు శ్రావణ్. స్వంత ఇంటికి వచ్చిన ఫీలింగ్ కలుగుతోందని…ధనిక రాష్ట్రం అప్పుల రాష్ట్రం గా మారిందని ఫైర్ అయ్యారు. పుట్టబోయే పిల్లలపై కూడా అప్పు పెడుతున్నారు…మేడిపండు లాంటి అభివృద్ధి చూపి బ్రాoతి కల్పిస్తున్నారని నిప్పులు చెరిగారు. తెలంగాణ ను పోలీస్ రాజ్యంగా మార్చేశారు..తెలంగాణ లో విద్యా వ్యవస్థను నాశనం చేశారని ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news