కాంగ్రెస్ పోరాటంతోనే దేశానికి స్వాతంత్రం – బట్టి విక్రమార్క

-

కాంగ్రెస్ పోరాటంతోనే దేశానికి స్వతంత్రం వచ్చిందని అన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.డిసిసి అధ్యక్షులతో జరిగిన జూమ్ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ.. మన నేతల త్యాగాల ఫలితమే నేటి మన స్వతంత్రం అని అన్నారు.దేశానికి కాంగ్రెస్ పార్టీ మన నేతలు చేసిన పోరాటాలు, త్యాగాలు నేటి తరానికి వివరించాలని అన్నారు బట్టి. స్వాతంత్ర ఫలాలు ఈ దేశ ప్రజలకు అందించడంలో కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక పాత్ర పోషించిందన్నారు.

భట్టి విక్రమార్క
భట్టి విక్రమార్క

స్వతంత్రానికి మందు ..తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు చేసిన కృషి ఫలితంగా నేడు దేశం ప్రపంచంలో ఒక గొప్ప దేశంగా నిలిచిందన్నారు. ఆగస్టు 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు 75 ఏళ్ల స్వతంత్ర వజ్రోత్సవల సందర్భంగా ఏఐసీసీ ఇచ్చిన పిలుపులొ భాగంగా అందరూ ఆజాది గౌరవ యాత్రలో పాల్గొని ప్రజలకు వివరించాలని తెలిపారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. కనీసం 75 కిలోమీటర్లు 75 మంది ముఖ్యులతో భారీ జాతీయ జెండాలతో అన్ని నియోజకవర్గాల్లో కలిసే విధంగా యాత్రలు నిర్వహించాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news