జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం జగన్

-

విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో పరేడ్ ప్రదర్శనను సీఎం జగన్ తిలకించారు. వాహనంలో ముఖ్యమంత్రితో పాటు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, సిఎస్ సమీర్ శర్మ ఉన్నారు. అనంతరం మువ్వన్నెల పథకాన్నిి ఆవిష్కరించిన సీఎం పోలీసుల నుంచి గౌరవ వందనం అందుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ జెండా భిన్నత్వంలో ఏకత్వానికి, ప్రజాస్వామ్యానికి ప్రతీక. పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండా భారతీయుల గుండె అంటూ చెప్పుకొచ్చారు. కాగా సాయంత్రం 5:30 గంటలకు రాజ్ భవన్ లో గవర్నర్ విశ్వ భూషణ్ హరి చందన్ ” ఎట్ హోమ్” కార్యక్రమం నిర్వహించనున్నారు. దీనికి ముఖ్యమంత్రి జగన్ సహా పలువురు నేతలు, అధికారులు హాజరుకానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news