సాయంత్రమే మునవ్వర్ షో..1000 మంది పోలీసులతో భద్రత

-

ఇవాళ సాయంత్రం మునవర్ కామెడీ షో జరుగనుంది. హైటెక్‌ సిటీలోని శిల్పకళావేదికలో మునవర్ షో జరుగనుంది. ఈ నేపథ్యంలోనే మునవర్ షో కి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. మునవర్ షోకి భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసిన సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర… శిల్పకళా వేదిక పరిసర ప్రాంతాల్లో మూడంచెల భద్రత వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు వివరించారు.

ఇప్పటికే శిల్పకళా వేదిక ను తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు… వెయ్యి మంది పోలీసు అధికారులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. మునవర్ షో కి వచ్చే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమతించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో ఈ షో టికెట్స్…అమ్ముడయ్యాయి. అటు మునవర్ కామెడీ షోను అడ్డుకుంటామంటూ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రకటన చేశారు. రాజాసింగ్ ప్రకటన నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు సైబరాబాద్ పోలీసులు.

 

Read more RELATED
Recommended to you

Latest news