పిల్లల ముందే పరాయి మగాడితో శృంగారం చేస్తూ, చివరికి!

-

హర్యానాలోని గురుగ్రామ్ లో అమానవీయకర సంఘటన జరిగింది. సోనాదేవి, తన కొడుకు ప్రవేషు తో కలిసి ప్రవేశ్ సోనేపట్ లోని జట్వాడ మోహన్లాల్ లో నివాసం ఉంటున్నారు. సోనాదేవి భర్త మరణించాడు. అయితే బాలుడు ప్రభుత్వ హాస్టల్ లో ఉంటూ చదువుకుంటున్నాడు. తల్లి మాత్రం ఒక ప్రైవేటు పాఠశాలలో వార్డెన్ గా పనిచేసింది. ఆ తరువాత ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉంటుంది. ప్రవేషు ఇంటికి వచ్చినప్పుడు తన తల్లి పరాయి వ్యక్తితో ఎక్కువగా ఫోన్ లో మాట్లాడుతుండటం గమనించాడు. దీంతో తల్లికి పలుమార్లు హెచ్చరించాడు.

ఈ క్రమంలో పద్ధతి మార్చుకొని తల్లి ఎఫైర్ కొనసాగిస్తూ వచ్చింది. ఒకరోజు బాలుడు ఉన్నట్లుండి ఇంటికి వచ్చాడు. అప్పుడు ఇంట్లో మరొక వ్యక్తితో తల్లి అభ్యంతరకర రీతిలో ఉండటాన్ని గమనించాడు. వెంటనే కోపంతో ఊగిపోయాడు. ఆవేశం పట్టలేక తన తల్లిని అక్కడ ఉన్న కత్తి తీసుకొని పలుమార్లు పొడిచి చంపాడు. ఆ తర్వాత శవాన్ని మంచం కింద సంచిలో పెట్టేశాడు. ఇంట్లో నుంచి భరించలేని దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో, వీరి ఇంటికి వెళ్లి చూడగా, మంచం కింద శవం కనిపించింది. దీంతో పోలీసులు శవాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ ఘటనపై వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news