అన్నమయ్య జిల్లాలో యువకుడి ప్రాణం తీసిన క్రికెట్ బెట్టింగ్

-

ఇటీవల కాలంలో చెడు వ్యసనాలకు బానిసలుగా మారుతున్న యువకుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. ముఖ్యంగా చాలామంది బెట్టింగ్ మోజులో పడి ఆర్థికంగా నష్టపోతున్నారు. ఇలా తీవ్ర నష్టాలు చవిచూసిన వారిలో కొందరు ప్రాణాలు తీసుకుంటున్నారు. తల్లిదండ్రుల ఆశలు.. ఆశయాలను తుంచి వేస్తూ వారికి తీరని విషాదాన్ని మిగులుస్తున్నారు. తాజాగా అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.

క్రికెట్ బుకీలా వేధింపులు తాళలేక రైలు కిందపడి ఆత్మహత్యయ చేసుకున్నాడు శంకూరి కార్తీక్ (35) . కోడూరు మండలం ఉప్పరపల్లి వద్ద రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు. గత కొన్ని రోజులుగా క్రికెట్ బుకీల వేధింపులు ఎక్కువ కావడంతో ఏం చేయాలో తోచగా ఆత్మహత్యచేసుకున్నట్లు సమాచారం. మృతునికి భార్య, ఓ కుమారుడు(5), కుమార్తె (3) ఉన్నారు. మృతుడు కోడూరు కొత్త బజార్ వైశ్య కుటుంబానికి చెందిన వారిగా రైల్వే పోలీసులు గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Latest news