కొడుకులు లేరని ముగ్గురు కూతుళ్లను చంపిన తల్లి

-

కొడుకులు పుట్టలేదని కన్నతల్లే.. ముగ్గురు కూతుళ్లను గొంతు నులిమి హత్య చేసిన ఘటన బిహార్ బక్సర్ లోని గైఘాట్ గ్రామంలో చోటుచేసుకుంది. బాలికల మృతదేహాల్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసుల విచారణలో బాధితురాలు విస్తుపోయే నిజాలు చెప్పింది. కుమారుడు లేడనే బాధతోనే ఇలా చేసినట్లు తెలిపింది.

నిందితురాలు పింకీ దేవికి కొడుకులు లేరు. తన సంతానంలో ముగ్గురు ఆడపిల్లలే. ఈ విషయం తలచుకుని నిందితురాలు నిత్యం బాధపడేది. అత్తమామలు కూడా సూటిపోటి మాటలతో ఆమెను తిట్టేవారు. మూడు రోజుల క్రితం తన తోటి కోడలికి బాలుడు జన్మించాడు. దీంతో పింకీ మరింత మనస్తాపానికి గురైంది. చివరకు ముగ్గురు కుమార్తెలను గొంతు నులిమి హత్య చేసింది. మృతులను పూనమ్​ కుమారి(10), రూనీ కుమారి(8), బబ్లీ కుమారిగా (3) గుర్తించారు.

”మా కోడలు మనుమరాళ్లకు భోజనం పెట్టింది. తెల్లవారిన ఇంకా బాలికలు గది నుండి బయటకు రాలేదు. దీంతో వారిని నిద్రలేపడానికి వెళ్లాం. అప్పటికే వారు ముగ్గురు మరణించి ఉన్నారు. బాలికల ముఖాలు నల్లగా ఉన్నాయి. ఇంట్లో మా కోడలు కనిపించలేదు. ఆమె పుట్టింటికి ఫోన్ చేశాం. అక్కడ లేదని చెప్పారు. ఇంట్లో రెండు తలుపులు తీసి ఉన్నాయి. విషం పెట్టి హత్య చేసిందేమో అని అనుమానించాం. కానీ పోలీసుల ఎదుట గొంతు నులిమి హత్య చేసినట్లు అంగీకరించింది.” అని నిందితురాలి అత్త చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news