పెట్రోల్ బంకుల్లో, గ్యాస్ సిలిండర్ల పై మోడీ ఫోటోలు పెట్టాలి – కల్వకుంట్ల కవిత

-

పెట్రోల్ బంకుల్లో, గ్యాస్ సిలిండర్ల పై మోడీ ఫోటోలు పెట్టాలని అన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. నిజామాబాదులో నిర్వహించిన కొత్త పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. రేషన్ షాప్ ముందు మోడీ ఫోటో లేదని కలెక్టర్ తో నిర్మల సీతారామన్ పంచాయతీ పెట్టిందని.. చరిత్రలో ఎప్పుడైనా రేషన్ షాప్ ముందు ఫోటోలు పెట్టారా? అని ప్రశ్నించారు. పెరిగిన నిత్యవసర ధరలకు కేంద్రమే కారణమని ఆరోపించారు.

ప్రతి కుటుంబానికి కేసీఆర్ పెద్దకొడుకులా మారి ఆసరాగా నిలుస్తున్నారని చెప్పారు. నిజామాబాద్ జిల్లాలో కొత్తగా 50వేలకు పైగా పెన్షన్లు ఇస్తున్నట్లుు తెలిపారు. అర్హులందరికీ పెన్షన్లు వస్తాయని.. ఎవరు దిగులు చెందవద్దని అన్నారు. మోడీ మాత్రం ఉచితాలు వద్దంటూ రాష్ట్రంలోని పథకాలను ఆపేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. పేదలకు పంచాల్సిన 10 లక్షల కోట్లను తన కార్పొరేట్ మిత్రులకు పంచిన ఘనత మోడీకే దక్కుతుందని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news